భారత్ న్యూస్ కోడూరు
కోడూరులో టిడిపి నుంచి వైసీపీలోకి చేరికలు..!
కోడూరులో పలువురు టిడిపి కుటుంబీకులు వైసీపీలో చేరారు.
ఆదివారం కోడూరు మండల వైసిపి కార్యాలయం వద్ద అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు రైతు విభగ జోనల్ ఇన్చార్జ్ కడవకొల్లు నరసింహారావు సమక్షంలో యార్లగడ్డ మార్క్ తదితరులు వైసిపి కండువా కప్పుకున్నారు.
ఈసందర్భంగా ఎమ్మెల్యే సింహాద్రి, వైసిపి ప్రభుత్వం పనితీరు నచ్చి పార్టీలో చేరినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పరిసే మాధవరావు, జడ్పిటిసి యాదవ రెడ్డి వెంకట సత్యనారాయణ, రైతు విభాగ కార్యదర్శి కొండవీటి వెంకటనారాయణ,వెన్నా ప్రసాద్ స్థానిక పార్టీ నేతలు పాల్గొన్నారు.