భారత్ న్యూస్ శ్రీకాకుళం….ఉన్నత విద్యాసంస్థల్లో 3220 అధ్యాపక పోస్టుల భర్తీ
▪️ఉత్తర్వులు జారీ చేసిన AP ప్రభుత్వం.
రాష్ట్రవ్యాప్తంగా విశ్వ విద్యాలయాలు, సాంకేతిక ఉన్నత విద్యా సంస్థల్లో ఖాళీగా ఉన్న 3220 అధ్యాపక పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు బుధవారం ఉన్నతవిద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ వర్సిటీల వారీ ఖాళీల వివరాలను వెల్లడిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గత నోటిఫికేషన్లలోని న్యాయపరమైన చిక్కులు, సాంకేతిక లోపాలను సవరించి, త్వరలోనే కొత్త నోటిఫికేషన్లు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
▪️ఆర్ జీయూకేటీ – 660.
▪️ఆంధ్ర యూనివర్సిటీ – 523.
▪️శ్రీ వేంకటేశ్వర వర్సిటీ – 265,
▪️శ్రీకృష్ణదేవరాయ – 219.
▪️జేఎన్టీయూ -ఎ – 203.
▪️ఆచార్య నాగార్జున – 175.
▪️వైఎస్సార్ ఆర్కిటెక్చర్ ఫైన్ ఆర్ట్స్ – 138.
▪️ జేఎన్టీయూ (గురజాడ-విజయనగరం) 138.
▪️యోగివేమన – 118.
▪️విక్రమ సింహపురి 106.
▪️రాయలసీమ – 103.
▪️శ్రీ పద్మావతి – 103.
▪️ఆదికవి నన్నయ – 99.
▪️డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ – 99.
▪️జేఎన్టీయూ(కె) – 98.
▪️కృష్ణా వర్సిటీ – 86.
▪️డాక్టర్ అబ్దుల్ హక్ – 63.
▪️ద్రవిడ – 24.
మొత్తం 3220 ఖాళీలున్నాయి.
