భారత్ న్యూస్ ఢిల్లీ…..కేంద్ర కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు
📍కేంద్ర ప్రభుత్వం కీలక ఖనిజాల రీసైక్లింగు ప్రోత్సహించడానికి రూ. 1,500 కోట్ల పథకానికి ఆమోదం తెలిపింది. ఈ పథకం ఆరు సంవత్సరాల పాటు (2025-31 వరకు) వర్తిస్తుంది. దీని ద్వారా బ్యాటరీ వ్యర్థాలు, ఇ-వ్యర్థాలను రీసైకిల్ చేస్తారు. ఇది దాదాపు రూ. 8,000 కోట్ల పెట్టుబడులు, 70 వేల ఉద్యోగాలను సృష్టించగలదని అంచనా.
