భారత్ న్యూస్ తిరుపతి…ప్రదోష వ్రతం, దీక్ష ఎలా చేయాలి ………..!!
సూర్యుడు అస్తమించే సమయంలో చంద్రుడి యొక్క కదలికలు వలన ఏర్పడునది ప్రదోషము దీనికి నిర్ములన అని కూడా అంటారు.
క్రిష్ణ పక్షం ,శుక్ల పక్షం, తిథుల ఏర్పడుతుంది దాని ఆధారంగా చంద్రుడి కదలికలు ఉంటాయి ఆ సంధులలో సూర్యాస్తమయము అయితే ప్రదోషము అంటారు. ప్రతిరోజూ సూర్యాస్తమయ సమయమునకు తిథి మారితే, అప్పుడు ప్రదోషము కలిగే అవకాశము ఉంది. అన్నిరోజులలో ప్రదోషాలు ఉంటుంది అందులో మూడు ప్రదోషాలు ముఖ్యమైనవి అవి, చతుర్థి, సప్తమి, త్రయోదశి లలో కలిగే ప్రదోషాలు. త్రయోదశినాడు కలిగే ప్రదోషాన్ని ’మహా ప్రదోషం’ అదే రోజు మాస శివరాత్రి కూడా ఉండటం వల్ల ఆ రోజు ఇంకా విశేషం అవుతుంది.
ఈ ప్రదోష కాల గణనము …..
ఏ రోజు సూర్యడు అస్తమించిన తర్వాత తొమ్మిది ఘడియల లోపల చతుర్థి తిథి వచ్చునో, ఆ దినము ప్రదోషము కలుగుతుంది.
అలాగే, ఏ దినమైనా సూర్యాస్తమయము తర్వాత చతుర్థి రెండు ఘడియలైనా ఉంటే ఆ దినము ప్రదోషము.
ఏ దినమందు సూర్యాస్తమయమైన తర్వాత పదిహేను ఘడియల లోపల సప్తమి తిథి వచ్చునో, ఆ దినము ప్రదోషము కలుగుతుంది.
అలాగే, ఏ దినమైనా సూర్యాస్తమయము తర్వాత సప్తమి ఒక్క ఘడియైనా ఉంటే ఆ దినము ప్రదోషము.
ఏ దినమందు సూర్యోదయము తర్వాత అరవై ఘడియల లోపల త్రయోదశి తిథి వస్తుందో, ఆ దినము ప్రదోషము కలుగుతుంది.
అలాగే, ఏ దినమైనా సూర్యాస్తమయము తర్వాత త్రయోదశి అర్ధ ఘడియైనా ఉంటే ఆ దినము ప్రదోషము .
ఈ త్రయోదశీ ప్రదోషము సమయాన్ని యిలాలెక్క కడతారు. సాయంత్రం నాలుగున్నర గంటలనుండీ ఇంచుమించు అర్ధరాత్రి వరకూ ప్రదోషమే. కొందరు సూర్యాస్తమయమునకు ముందర రెండున్నర ఘడియలు, తర్వాత రెండున్నర ఘడియలూ అంటారు. ( ఒక ఘడియ = 24 నిమిషాలు )
సూర్యాస్తమయ కాలము మనకు తమోగుణ ప్రధానమైనది . ఆ సమయములో ప్రదోషమైతే, కొన్ని అనుష్ఠానములు చేయాల్సిఉంటుంది. మామూలుగా చతుర్థి, సప్తములలో ధ్యానము, గాయత్రీ జపము చేయవచ్చును. ప్రదోష సమము శివునికి చాలా ఇష్టమైన కాలము అని కూడా అంటారు ఆ సమయంలో పులిచర్మ ధరించి (నాట్యం చేసే సమయంలో మటుకే పులి చర్మం ధరిస్తారు తక్కిన వేళల్లో ఎల్లపుడు కరిచర్మం ధరిస్తారు) ఆనంద తాండవం చేస్తారు తరువాత నంది వాహనం పై పార్వతితో కలిసి సంచారం చేస్తూ ఉంటారు అందుకే ఆ సమయంలో తినడం నిద్రపోవడం అరవడం లాంటివి చేయాకుడదు తలకు నూనె అంటకూడదు ధ్యానం ,ఆరాధన, పూజ లాంటివి చేసుకోవాలి అంటారు
మామూలుగా ప్రతి పక్షములోనూ ప్రదోషము వస్తుంది. కానీ కృష్ణ పక్షములో చతుర్దశి రోజు మాసశివరాత్రి వస్తుంది. దాని వెనుకటి రోజు త్రయోదశిలో మహా ప్రదోష కాల శివపూజ విధించబడినది. శుక్ల పక్షములో కూడా త్రయోదశికి ప్రత్యేకత కలదు. ఆరోజు కూడా శివ పూజనే చేయాలి.
మన పాపకర్మ ఫలమును నిర్జీవం చేయాలంటే, దానికి తగ్గ పుణ్య కర్మలు చేయాలి. ఈ త్రయోదశీ ప్రదోషము మనకు దేవుడిచ్చిన వరము. పరమ శివుడు తన ప్రమథగణాలతో కొలువై మన పూజలు అందుకోడానికి సిద్ధంగావుండే సమయమది. మన పాపకర్మల ఫలాన్ని పటాపంచలు చేసి గరళము వలె మింగి, మనకు సాత్త్విక గుణమును కలిగించి మన కష్టములను తగ్గించును .
ఈ త్రయోదశి శనివారమొస్తే దాన్ని శని త్రయోదశి అనీ, సోమవారమొస్తే దాన్ని సోమప్రదోషమనీ పిలుస్తారు. ఇవి కాక, గురువారమునాడు వచ్చే ప్రదోషము కూడా అత్యంత ప్రాముఖ్యము కలది. అన్ని త్రయోదశులలోనూ శివపూజ తప్పనిసరి అయినా, ఈ మూడు రోజులూ మాత్రము మరింత విశేషమైనవి.
శని త్రయోదశినాడు చేసిన శివపూజ వలన జాతకములోని శని ప్రభావము కూడా తొలగింపబడుతుంది. శని మహాత్ముడు కర్మలకు ప్రతినిధి అని పిలవబడుతాడు. మన కర్మల ఫలితాన్ని నిర్దేశించి మనకు పాఠాలు నేర్పువాడు ఇతను. అట్టి శని ప్రభావమును కూడా ఈ ప్రదోషపూజతో పోగొట్టుకొనవచ్చును .
సోమ ప్రదోషము నాడు చేసిన పూజ వలన మనసు శుద్ధమై త్రికరణ శుద్ధి కలుగుతుంది. సోమవారము శివుడికి ప్రీతి పాత్రమైనది. ఆరోజు చేసిన శివపూజ సర్వ పాపహరము, సర్వ పుణ్యదము.
ఇక గురువారము త్రయోదశీ ప్రదోషము వస్తే, ఆనాడు చేసిన పూజ వలన గురు అనుగ్రహము కలిగి, విద్యాబుద్ధులు, సంపదలు కలుగుతాయి. గురువు వాక్పతి, బుద్ధిని ప్రేరేపించువాడు, మరియు ధన కారకుడు. జాతకములో గురు దోషములకు రుద్రారాధన విరుగుడుగా చెప్పడము మనకు తెలిసినదే .
ఈ త్రయోదశీ ప్రదోషమునాడు ఎవరికి వీలైనంతగా వారు, మహాన్యాస పూర్వక ఏకాదశవార రుద్రాభిషేకమో, ఏకవార రుద్రాభిషేకమో, లఘున్యాస నమక చమక పఠనమో, ఉత్త పాలతో అభిషేకమో, మారేడు దళములతో అర్చననో, ఏదో ఒకటి చేసి అనంత ఫలము పొందండి. భక్తితో ఉద్ధరిణెడు నీళ్ళు పోస్తే చాలు పొంగిపోతాడు, భోళా శంకరుడు
ప్రదోష పూజ..
రోజూ వచ్చే ప్రదోషం సూర్యాస్తమయం లో చేసుకోవచ్చు సాయంత్రం స్నానం చేసి విభూది ధరించి శివ ప్రదోషం పూజ చేసి వారు ఆ సమయంలో రుద్రాక్షలు ధరించాలి..చాలా చిన్నపరిమితిలో ఉన్న లింగానికి నీటితో అభిషేకం చేయాలి .శివుడు గంగాధర్ ఆయన తలపైన నీటితోనే అభిషేకం చేయడం ఉత్తమం, అలా అని వేరే వాటితో చేయడం తప్పు అని కాదు అది మన తృప్తి కోసం చేయడమే కానీ నిజానికి శివారాధన అబీషేకం లో నీరు మటుకే గంగా జలం గా భావించి చేయాలి..( నిజముగా పరమేశ్వరుడు మన ముందు ఉంటే ఆయన తలపైన పాలు తేన పోసి బంక అంటించరు కదా) స్వామి మన ముందు ప్రత్యక్షంగా ఉన్నారు అన్న భావనలో సంకల్పమ్ చెప్పుకొని విభూది తో అర్చన చేయాలి..
ఇది వ్రతం లాగా చేసే వాళ్ళు అనుష్ఠానం చేసి గాయత్రి చేసి చేయాలి…
శివోపాసకులు చేసే పంచ రుద్ర పంచముఖ ధ్యాన అర్చన విధానం..
శ్రీ రుద్రదేవతా రూపం – శ్రీ రుద్ర పంచముఖ ధ్యాన శ్లోకాలు, తాత్పర్యము తెలుసుకుని చదివితే ఇంకా ఆనందంగా ఉంటుంది.
ధ్యానంలోని శ్లోకాలు న్యాసంలో ప్రస్తావించబడ్డాయి. తత్పురుష, అఘోర, సద్యోజాత, వామదేవ, ఈశానముఖ రూపాలలో ఉండే పరమేశ్వరుని ఐదు ధ్యాన శ్లోకాల రూపంలో బోధాయనులు రచించారు. ఈ మహాన్యాస వివేచనము రావణ ప్రోక్త న్యాస ప్రక్రియలోనిది. ఆ శ్లోకాలు, తాత్పర్యము క్రింద. దీనినే శివ పంచానన స్తోత్రం అని కూడా అంటారు.
1.తత్పురుష ముఖ ధ్యానమ్
సంవర్తాగ్ని తటిప్రదీప్త కనక – ప్రస్పర్ధితేజోమయం
గంభీర ధ్వని మిశ్రితోగ్ర దహన – ప్రోద్భాసితామ్రాధరం
అర్ధేందుద్యుతిలోలపింగలజటా – భారప్రబద్ధోరగం
వందే సిద్ధ సురాసురేంద్రనమితం – పూర్వం ముఖం శూలినః
తాత్పర్యము: ప్రళయ కాలము నందలి అగ్ని తేజము తోనూ, మెరపుల తేజముతోను, బాగా కరిగిన బంగారు కాంతితోను పోటీ పదే తేజములే తన రూపముగా కలది, గంభీరధ్వనితో మిశ్రితము అగుతతో పాటు భయంకరమైన అగ్ని వలె ప్రకాశించు ఎర్రని పెదవి కలదియు, చంద్ర ఖండ కాంతితో చక చక మెరయు పింగళ వర్ణపు జడల గుంపును, దాని చుట్టూ గట్టిగా చుట్టిన సర్పములు కలదియు, సిద్ధులు, సురాసురుల చేత నమస్కరించబడుతున్న, శూలికి సంబంధించిన తూర్పున ఉన్న ముఖమును నమస్కరించుచున్నాను. (రజో గుణ ప్రధానమైన సృష్టి తత్వమును ఈ శ్లోకములో స్తుతి చేయబడినది
2.అఘోర ముఖ ధ్యానమ్
కాలాభ్రభ్రమరాంజనద్యుతినిభం – వ్యావృత్తపింగేక్షణం
కర్ణోద్భాసితభోగిమస్తకమణి – ప్రోద్భిన్న దంష్ట్రాంకురం
సర్పప్రోత కపాలశుక్తి శకల – వ్యాకీర్ణ సంచారగం
వందే దక్షిణమీశ్వరస్య కుటిల – భ్రూభంగ రౌద్రం ముఖం
తాత్పర్యము: నల్లని మేఘములు, తుమ్మెదల కాటుక – వీటి కాంతిని పోలిన కాంతితో ప్రకాశించునదియు, మిక్కిలి మిట్టగా తిరుగుచుండు పింగా వర్ణపు కన్నులు కలదియు, చెవుల యందు మిక్కిలి ప్రకాశించుచుండు సర్ప శిరోరత్నములతో బాగా కలిసిపోవుచున్న కోరల మొలకలు కలదియు, సర్పములతో పాటు (హారముగా) కూర్చబడిన కపాలములతో, ముత్యపు చిప్పల ముక్కలతోను, ఎగుడు దిగుదగుచున్న నడకను పొందినదియు, వంకరలుగా నున్న కను బొమ్మల ముడులతో భయంకరముగా నున్న ఈశ్వరుని దక్షిణ ముఖమును నమస్కరించు చున్నాను. (తమో గుణ ప్రధాన లయ కర్త తత్వము ఇక్కడ స్తుతి చేయబడింది)
3.సద్యోజాత ముఖ ధ్యానమ్
ప్రాలేయాచల చంద్రకుంద ధవళం – గోక్షీరఫేన ప్రభం
భస్మాభ్యక్తమనంగదేహ దహన – జ్వాలావళీలోచనం
బ్రహ్మేంద్రాది మరుద్గణైః స్తుతి పరై – రభ్యర్చితం యోగిభిః
వందేహం సకలం కళంకరహితం – స్థాణోర్ముఖం పశ్చిమం
తాత్పర్యము: హిమవత్పర్వతము, చంద్రుడు, మొల్ల పూవు – వీని వలె తెల్లనిదియు, ఆవుపాల మీద నురుగు వలె తెల్లని కాంతి కలదియు, విభూతి పూయబదినదియు, మన్మథుని శరీరమును దహించు జ్వాలల పంక్తితో నిండిన కన్ను కలదియు, స్తోత్రము చేయుచున్న బ్రహ్మేన్ద్రాది దేవ సమూహముల చేతను, యోగుల చేతను శ్రద్ధతో అర్చించ బడుచున్నదియు, నిర్మలమైన నిండు వాదనముతో కనబడుచున్నదియును అగు శివుని పశ్చిమ నమస్కరించు చున్నాను. (సత్వ గుణ ప్రధాన రక్షణ కర్త తత్వమును ఈ శ్లోకములో స్తుతించ బడినది)
4.వామదేవ ముఖ ధ్యానమ్

గౌరం కుంకుమ పంకిలం సుతిలకం – వ్…