Pulivarthi Nani paid tributes to the deceased children and visited the family members

మృతి చెందిన చిన్నారులకు నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించిన పులివర్తి నాని

పాకాల (భారత్ న్యూస్ )తిరుపతి జిల్లా, చంద్రగిరి నియోజకవర్గం, పాకాల మండలం ఊటువంక చెరువులోకి సోమవారం మధ్యాహ్నం ముగ్గురు పిల్లలు ఈతకు వెళ్లి మృతి చెందిన విషయం తెలుసుకున్న చిత్తూరు పార్లమెంటరీ అధ్యక్షుడు, చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని జరిగిన సంఘటన తెలుసుకొని అభం శుభం ఎరుగని మృతి చెందిన ముగ్గురు చిన్నారులు ఎల్.పునీత్ కుమార్ (11) ఎల్.కన్నయ్య (9) ఎస్.తేజేశ్వర్ (10) చిన్నారుల మృతదేహాలను చూసి భావోద్వేగానికి లోనయ్యారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతదేహాలను తరలించేందుకు అంబులెన్స్ ఏర్పాటు చేసి కుటుంబ సభ్యులను పులివర్తి నాని పరామర్శించారు.