The arrears of Jagananna Vidya Devena accommodation should be released immediately

NS UI District Leaders Manjunath

భారత్ న్యూస్ విజయవాడ,

జగనన్న విద్యా దీవెన వసతి దీవెన బకాయిలను తక్షణం విడుదల చేయాలి

ఎన్ఎస్ యుఐ జిల్లా నాయకులు మంజునాథ్

రాష్ట్ర ప్రభుత్వము జగనన్న విద్యా దీవెన వసతి దీవెన బకాయిలను తక్షణం విడుదల చేయాలని ఎన్ఎస్ యుఐ జిల్లా నాయకులు మంజునాథ్ డిమాండ్ చేశారు. స్థానిక రాప్తాడు మండలంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు మాట్లాడుతూ. మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం నాలుగేళ్లలో జగనన్న విద్యా దీవెన వసతి దీవెన బకాయిలు చెల్లించకుండా పేద విద్యార్థులను మోసం చేస్తోందన్నారు.గత ప్రభుత్వం 16 లక్షల మందికి ఫీజు రీఎంబర్స్మెంట్లు అందిస్తే ఈ ప్రభుత్వం తొమ్మిది లక్షల మందికి మాత్రమే అందజేసింది అన్నారు. విద్యారంగా అభివృద్ధికి పెద్దపీట వేస్తామని గొప్పలు పలుకుతూ విద్యారంగాన్ని ప్రస్తుత ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందన్నారు.తక్షణం పెండింగ్లో ఉన్న జగనన్న విద్యా దీవెన వసతి దీవెన బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో నవీన్, మహేంద్ర, మహేష్ తదితులు పాల్గొన్నారు.