Journalism-Journalists (investigative articles) write a special book

ఐబీఎన్ భవన్ ప్రెస్ క్లబ్ కి”జర్నలిజం-జర్నలిస్టులు” పుస్తకం బహూకరణ.

గతనెల 16వ తేదీన జాతీయ పత్రికా దినోత్సవం రోజున ఆవిష్కరించబడిన జర్నలిజం-జర్నలిస్టులు (పరిశోధనాత్మక కధనాలు) ప్రత్యేక పుస్తకాన్ని రచయి త,సీనియర్ జర్నలిస్ట్ ఈపూరి రాజారత్నం మంగ ళగిరి ఐబీఎన్ భవన్ ప్రెస్ క్లబ్ లైబ్రరీకి బహూకరించా రు.ఈ పుస్తకావిష్కరణ విషయంలో ప్రెస్ క్లబ్ అధ్యక్ష,కార్యదర్శుల సహకారం ఎంతో ఉందని, ప్రెస్ క్లబ్ సభ్యులు అండగా నిలిచారని రచయిత, జర్నలిస్ట్ రాజారత్నం అన్నారు.ప్రెస్ క్లబ్ లైబ్రరీకి బహుకరించిన రెండు పుస్తకాలు స్థానిక జర్నలిస్టు లు చదివేందుకు బహూక రించడం జరిగింది అని అన్నారు.ఈ పుస్తకాలను ఐబీఎన్ భవన్ ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి బందెల దయాకర్,సీనియర్ జర్నలిస్ట్,ప్రెస్ క్లబ్ సభ్యులు చెక్కా కళ్యాణ్ లకు పుస్తకం అందించారు. ఈ పుస్తకం ఐబీఎన్ భవన్ ప్రెస్ క్లబ్ లో అందుబాటు లో ఉంటుంది అని ఈ జర్నలిజం-జర్నలిస్టులు ప్రత్యేక పుస్తకం చదవాలి అనే ఆశక్తి ఉన్నవారు ప్రెస్ క్లబ్ తెరిచి ఉన్న సమయం లో చదువుకోవచ్చునని,ఈ కాపీలు రెండు లైబ్రరీ కాపీలుగా ఉపయోగించు కునేందుకు సహకారం అందించాలని దయాకర్ అన్నారు.