Ikamatyam is the chief guest at the Kartikamasa Vana Samaradhana program

ఏలూరు జిల్లా కైకలూరు:::: (భారత్ న్యూస్):::: * ఐకమత్యం అంటే ఇదే కార్తీకమాస వన సమారాధన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగాా పాల్గొని కైకలూరు శాసన సభ్యులు దూలం నాగేశ్వరరావు ఈ రోజు కైకలూరు మార్కెట్ యార్డ్ నందు జరిగిన కాపు ఐక్య వన సమారాధన మహోత్సవమునకు ముఖ్య అతిధిగా పాల్గొని…. వడ్డన చేశారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమములతో వివిధ ఆటల పోటీలతో కళాకారుల నృత్యములో అధ్యాంతం అలరింప చేసేలా నిర్వహించిన కార్యనిర్వహణ కమిటీ వారికి అభినందనలు తెలియ చేసి,వివిధ పార్టీలకి అతీతముగా ఈ రోజున మనమందరం ఈ ఐక్య వేదికకి ఒక్కటిగా కలిసి ఇంత పెద్ద ఎత్తున వచ్చిన మీఅందరిని ఒకే చోట కలవటం చాలా ఆనందంగా ఉన్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలో ఉన్న కాపు సామాజిక వర్గ పెద్దలు మరియు సభ్యులు, వన సమారాధన కార్యనిర్వాహణ సభ్యులు, తదితరులు పాల్గొని ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కార్తీక వనసమయారాధన ద్వారా బంధాలు బలపడతాయని, అందరికి పార్వతి పరమేశ్వరుల ఆశీస్సులుతో సంతోషంగా ఎల్లప్పుడూ వుండాలని ఎం.ఎల్.ఎ. డి.ఏన్.ఆర్.కోరుకున్నారు