Shashti Kalyanotsava celebrations at Subrahmanyeshwar Swamy Temple along with Shrivalli Devasena Temple Chairman Oceana Pattabhi Reddy

శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో షష్ఠి కళ్యాణోత్సవ వేడుకలు ఆలయ చైర్మన్ మహాసముద్రం పట్టాభి రెడ్డి

పాకాల( భారత్ న్యూస్ )
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం ఊట్లవారిపల్లి సమీపంలో ఆనందగిరి పై వెలసిన శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో సోమవారం షష్టి మహోత్సవాన్ని పురస్కరించుకొని స్వామి వారి కళ్యాణోత్సవ మహోత్సవంతో పాటు సుమారు 50 మంది దంపతులు పైగా పాల్గొన్నారు అని ఆలయ చైర్మన్ మహాసముద్రం పట్టాభిరెడ్డి తెలిపారు.

ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మహాసముద్రం పట్టాభి రెడ్డి మాట్లాడుతూ షష్టి దినోత్సవాన్ని పురస్కరించుకుని స్వామివారి ఆలయంలో నిత్య పూజలతో పాటు అభిషేకం కళ్యాణ మహోత్సవమును నిర్వహించడం జరిగిందని,ఈ కార్యక్రమానికి ఇతర ప్రాంతాల నుండి సుమారు వెయ్యి మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకుని కళ్యాణోత్సవంలో పాల్గొని తమ మొక్కలను తీర్చుకున్నారని పేర్కొన్నారు.ఆలయ ప్రాంగణంలో భారీ ఎత్తున 54 అడుగుల శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం ప్రారంభించిన నాటినుండి ఇతర ప్రాంతాల నుండి భక్తులు విశేషంగా వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారని పేర్కొన్నారు.

ఉదయం భక్తులకు తీర్థప్రసాదాలు,మధ్యాహ్నం భోజన వసతి ఏర్పాట్లను చేశామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు,ఈఓ ఎస్.యువరాణి,జూనియర్ అసిస్టెంట్ ప్రకాష్,అర్చకులు,ఆలయ సిబ్బంది,భాస్కర్,మణి,తదితరులు పాల్గొన్నారు.