*శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం విస్తృత ఏర్పాట్లు టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి
తిరుమల( భారత్ న్యూస్ )
10 రోజుల్లో ఎప్పుడు దర్శించుకున్నా ఒకే ఫలితం
- శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు శ్రీ వేణుగోపాల దీక్షితులు
వైష్ణవాలయాల సంప్రదాయాలను పాటిస్తూ తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబరు 23 నుండి జనవరి 1వ తేదీ వరకు వైకుంఠ ద్వారం 10 రోజుల పాటు తెరచి ఉంచి భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తామని, ఇందుకోసం విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నామని టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో సోమవారం వైకుంఠ ద్వార దర్శనం ఏర్పాట్లపై వివిధ విభాగాధిపతుతో సమావేశం నిర్వహించారు.
అనంతరం ఈవో మీడియాతో మాట్లాడుతూ డిసెంబరు 23న తెల్లవారుజామున 1.45 గంటలకు వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభించి, జనవరి ఒకటో తేదీ రాత్రి 12 గంటలకు మూసివేస్తామన్నారు. అదేవిధంగా ఇతర వివరాలను ఈవో తెలియజేశారు. - తిరుమలలోని క్యూలైన్లలో ఎక్కువ సేపు వేచి ఉండకుండా శ్రీవారి దర్శనం చేసుకోవడానికి వీలుగా డిసెంబరు 22వతేదీ మధ్యాహ్నం 2 గంటల నుండి తిరుపతిలోని 9 కేంద్రాలలో 90 కౌంటర్ల ద్వారా కోటా పూర్తయ్యేంత వరకు మొత్తం 4,23,500 సర్వదర్శనం టోకెన్లు మంజూరు చేస్తాం.
- తిరుపతిలోని విష్ణునివాసం, శ్రీనివాసం, గోవిందరాజస్వామి సత్రాలు, భూదేవి కాంప్లెక్స్, రామచంద్ర పుష్కరిణి, ఇందిరా మైదానం, జీవకోన హైస్కూల్, భైరాగిపట్టెడలోని రామానాయుడు హైస్కూల్, ఎంఆర్ పల్లిలోని జడ్పి హైస్కూల్లో ఉచితంగా సర్వదర్శన టోకెన్లు పొందవచ్చు.
- డిసెంబరు 22వ తేదీకి సంబంధించిన ఎస్ఎస్డి టోకెన్లు రద్దు చేయడమైనది.
- దర్శన టోకెన్లు గల భక్తులకు మాత్రమే తిరుమలలో గదులు కేటాయించడం జరుగుతుంది. తిరుమలలో గదులు పరిమితంగా ఉన్న కారణంగా ఈ పర్వదినాలలో భక్తుల రద్దీ దృష్ట్యా తిరుపతిలో గదులు పొందాల్సిందిగా భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నాం.
- గతంలో వలెనే ఈ సంవత్సరం కూడా స్వయంగా వచ్చే ప్రోటోకాల్ విఐపిలకు, కుటుంబ సభ్యులకు పరిమిత సంఖ్యలో మాత్రమే బ్రేక్ దర్శనం ఇవ్వబడుతుంది. 10 రోజుల పాటు సిఫారసు లేఖలు స్వీకరించబడవు.
- వైకుంఠ ద్వార దర్శన ఫలితం 10 రోజలు పాటు ఉంటుంది. కావున విఐపిలు, ఇతర భక్తులు పది రోజుల్లో ఏదో ఒకరోజు దర్శనం చేసుకోవడానికి ప్రణాళికలు రూపొందించుకోవాల్సిందిగా కోరడమైనది.
- టోకెన్లు, టికెట్లు పొందిన భక్తులను 24 గంటలు ముందు మాత్రమే తిరుమలకు అనుమతిస్తారు.
- టోకెన్లు లేని భక్తులు తిరుమలకు రావచ్చు. కానీ దర్శనం ఉండదు. వారు తలనీలాలు సమర్పించి ఇతర సందర్శనీయ ప్రాంతాలను దర్శించుకోవచ్చు.
- దర్శన టోకెన్లు పొందిన భక్తులు తమ టోకెన్లపై సూచించిన తేదీ, సమయానికే శ్రీవారి దర్శనానికి రావాలని విజ్ఞప్తి.
- దూరప్రాంతాల్లో ఉన్న భక్తులు టీటీడీ వెబ్సైట్, ఎస్వీబీసీ, ఇతర మాధ్యమాల ద్వారా టోకెన్ల లభ్యత తెలుసుకున్న తరువాతే తిరుమల ప్రయాణం ఖరారు చేసుకోగలరు.
ప్రత్యేక కార్యక్రమాలు