ఆకస్మికంగా గుండెపోటుతో వ్యక్తి దుర్మరణం..

భారత్ న్యూస్,:
ఆకస్మికంగా గుండెపోటుతో వ్యక్తి దుర్మరణం..

కూడేరు ఏప్రిల్ 12 (భారత్ న్యూస్) స్థానిక మండల కేంద్రం సమీపంలోని ముద్దులాపురం గ్రామ కాపరస్తుడైన ధమ్మర రామప్ప వయసు 60 గుండెనొప్పి రావడముతో ముద్దలాపురం గ్రామం నుండి శుక్రవారం కూడేరు మండల కేంద్రమునకు ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స కోసం వచ్చినట్లు కుమారుడు ఆంజనేయులు తెలియజేశారు, కానీ గుండెనొప్పి ఎక్కువ కావడంతో అనంతపురం మెరుగైన వైద్యం కోసం మృతుని కుమారుడు ఆంజనేయులు బైకులు తీసుకువెళ్లగా కూడేరు అనంత వెంకట్రామిరెడ్డి కాలనీ సమీపంలోని గుండె నొప్పి ఎక్కువ కావడంతో అక్కడకక్కడే మరణించినట్లు కుమార్ మృతుని కుమారుడు ఆంజనేయులు విలేకరులకు తెలియజేశారు, ఇంతకు మునుపు కూడా ఇలాగే నొప్పి అప్పుడప్పుడు రావడం జరిగిందని ఉన్నట్టుండి తండ్రి మృతి చెందడంతో కుమారుడు కన్నీరు మున్నీరుతో విలవిలలాడాడు.