happy birthday of sardar patel

ఘనంగా సర్దార్ పటేల్ జయంతి భారత్ న్యూస్ శ్రీకాకుళం ,అక్టోబర్ 31 శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కేశవరావుపేట ఉన్నత పాఠశాలలో ఏక్తా దివాస్ (జాతీయ సమైక్యత దినోత్సవ) కార్యక్రమం మంగళవారం ఘనంగా నిర్వహించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఏర్పాటైన ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు చల్లా భారతి సర్ధార్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు . పటేల్ భారతదేశానికి అందించిన సేవలను ఆమె కొనియాడారు.ఈ సందర్భంగా నిర్వహించిన చిత్రలేఖన పోటీల్లో విజేతలకు బెజ్జిపురం యూత్ క్లబ్ తరఫున బాలవికాస్ కార్యక్రమంలో భాగంగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పారుపల్లి శ్రీనివాసరావు ,రాధా రాణి, ఝాన్సీ లక్ష్మీబాయి, విజయలక్ష్మి, ప్రసాద రావు ,యూత్ క్లబ్ ప్రతినిధులు మెహర్వాణి, భవాని తదితరులు పాల్గొన్నారు.