విద్యార్థులకు దంత వైద్య పరీక్షలు భారత్ న్యూస్,
ఎచ్చెర్ల, డిసెంబర్ 13: శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల
మండలంలో ఎచ్చెర్ల పోలీస్ క్వార్టర్స్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గురువారం నిర్వహించిన ఉచిత దంత వైద్య శిబిరంలో 380 మంది విద్యార్థులకు దంత వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ శిబిరాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి. శ్రీరాములు ప్రారంభించారు.శిబిర నిర్వహణకు సమన్వయకర్తగా జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు పారుపల్లి శ్రీనివాస రావు వ్యవహరించారు. సంపత్ వినాయక సూపర్ స్పెషాలిటీ రూపా దంత వైద్యశాల, శ్రీకాకుళం వారి సౌజన్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో దంత వైద్యులు బి.శ్రీనివాస్ ,బి.రూప లు విద్యార్థులను తనిఖీ చేసి అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేశారు. కార్యక్రమంలో దంత వైద్యశాల సహాయకులు గణేష్, వాసు ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు
Dental examinations were conducted for 380 students in the free dental camp.
![](https://www.bharathnewsapp.com/wp-content/uploads/2023/12/stude.jpeg)