BJP flag waved in Mudinepally BJP flag under Dimma Kotaprolu Krishna

ఏలూరు జిల్లా ముదినేపల్లి::::(భారత్ న్యూస్) 2023\12\27 ముదినేపల్లిలో రెపరెపలాడిన బిజెపి జండా దిమ్మ కోటప్రోలు కృష్ణఆధ్వర్యంలోబిజెపి జెండా దిమ్మను స్థాపింప చేసి ముఖ్యఅతిథిగా బిజెపి పార్టీమాజీ వైద్య శాఖ మినిస్టర్ కామినేని శ్రీనివాసరావు ముఖ్య అతిథిగాపాల్గొనిబిజెపి జండా స్థూపానికిరిబ్బన్ కట్ చేసిస్వర్గీయ భారతప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి కి ఘననివాళులు అర్పించి, మాట్లాడుతూ
మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజపేయి దేశం గర్వించదగ్గ అత్యుత్తమ వ్యక్తి అని మాజీ మంత్రి వర్యులు శ్రీ కామినేని శ్రీనివాస్ అన్నారు.
సోమవారం ముదినేపల్లి మండల కేంద్రం గురజ రోడ్ సెంటర్ నందు జిల్లా ప్రధాన కార్యదర్శి కోటప్రోలు కృష్ణ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన జెండా దిమ్మ ను మాజీ మంత్రి వర్యులు శ్రీ కామినేని శ్రీనివాస్ ఆవిష్కరించారు.
అనంతరం అటల్ బిహారీ వాజపేయి జయంతి వేడుకలను ఆ పార్టీ నేతలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కామినేని మాట్లాడుతూ దేశ ప్రధానిగా, ఉత్తమ పార్లమెంటేరియన్ గా దేశానికి ఎన్నో సేవలు అందించారని అన్నారు. నేడు దేశంలో నిర్మితం అవుతున్న హైవేలు రూపకల్పన వాజపేయి చేశారని గుర్తు చేశారు. వాజపేయి అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు నడవాలని కామినేని శ్రీనివాస్ పిలుపునిచ్చారు. అంతకుముందు వాజపేయి చిత్రపటానికి పూలమాలను వేసి నివాళులర్పించారు కోటప్రోలు కృష్ణ నివాసములో ఏర్పాటుచేసిన విందు భోజనాన్నికి హాజరై పార్టీ బలోపేతానికి మనమందరం క్రుషి చైయాలని చెప్పి,తాగు సూూచనలు,సలహాలు ఇచ్చారు . ఈ కార్యక్రమంలో ముదినేపల్లి మండల అధ్యక్షులు సత్యవోలు నాగలక్ష్మి,మండవల్లి మండల అధ్యక్షులు సమయం యేసు బాబు , పైడిపాటి శివశంకర్, వైవాక మాజీ సర్పంచ్ లక్ష్మీపతి రాజు, జిల్లా మహిళా విభాగ ఉపాధ్యక్షురాలు రెడ్డి రాధిక, జిల్లా కార్యవర్గ సభ్యుడు వత్తుమిల్లి ప్రసాద్, మండల ప్రధాన కార్యదర్శి కొల్లిపర నాగరాజు ,నీలం మల్లేశ్వరరావు, కారుమూరి వెంకటేశ్వరరావు,మొవ్వ ఫణి, భుజంగవెంకటనరసింహారావు ,మహిళా మండల అధ్యక్షురాలు రెడ్డి నాగలక్ష్మి, బాసినశెట్టి కిషోర్ జనసేన నాయకులు తోట లక్ష్మి,కొల్లి బాబి తదితరులు పాల్గొన్నారని. ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలియపరిచారు