ప్రమాదవశాత్తు చెరువులో పడి ముగ్గురు పిల్లలు మృతి…..
సంఘటన స్థలాన్ని పరిశీలించిన పాకాల సి.ఐ రాజగోపాల్……
పాకాల (భారత్ న్యూస్ ) మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు….. సిఐ రాజగోపాల్
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం ఉప్పు వంక గ్రామానికి చెందిన పునీత్ కుమార్(11),తేజేశ్వర్(9),కన్నయ్య(9),స్కూల్ ముగించుకుని సోమవారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో సమీపాన ఉన్న చెరువు వద్ద ఆడుకుంటూ ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది.దీంతో ఆ కుటుంబాలలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.ఈ సంఘటన చూసి గ్రామంలోని ప్రజలు కన్నీటి పర్వతమయ్యారు.విషయం తెలుసుకున్న పాకాల సి.ఐ రాజ గోపాల్ తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు.పాకాల సి.ఐ రాజ గోపాల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.చిన్నారుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని పేర్కొన్నారు.