Budget approved for development of mandal with Rs.60 crores

భారత్ న్యూస్ విజయవాడ,

రూ.60 కోట్లతో మండల అభివృద్ధికి బడ్జెట్ ఆమోదం
భారత్ న్యూస్ డిసెంబర్ 19 శ్రీకాకుళం జిల్లా లావేరు మండల పరిషత్
వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.60 కోట్లతో మండలంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు వీలుగా అంచనా బడ్జెట్ ను ఆమోదించింది .మండలాధ్యక్షురాలు లుట్ట అమ్మాజమ్మ అధ్యక్షతన మంగళవారం మండల పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన బడ్జెట్ సమావేశంలో ఈ మేరకు ఆమోదించారు .2024- 25 ఆర్థిక సంవత్సరంలో 66 కోట్ల పద్నాలుగు లక్షల 470 రూపాయలు ఆదాయంగాను ,60 లక్షల 2వేల721 రూపాయలు వ్యయంగాను అంచనా వేశారు.6 లక్షల 11,740 రూపాయలు మిగులుగా అంచనా వేశారు. అదే విధంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో
61 కోట్ల 14 లక్షల 370 రూపాయలు ఆదాయంగా ,54 లక్షల 38,640 రూపాయలు వ్యయంగా గుర్తించారు. 6,75,730 రూపాయలు మిగులుతో ఈ ఏడాది సవరణ బడ్జెట్ ను ఆమోదించారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ ప్రత్యేక ఆహ్వానితులు రొక్కం బాలకృష్ణ , జెడ్పీటీసీ మీసాల సీతం నాయుడు ,ఎంపీడీవో కె. సురేష్ కుమార్ ,ఈఓపీఆర్డి ,అధికారులు, ఎంపీటీసీలు ,సర్పంచులు పాల్గొన్నారు.