Be a part of Bahujan’s Kingdom.

భారత్ న్యూస్ విజయవాడ,

బహుజన రాజ్యధికారంలో భాగస్వాములవ్వండి.

జై భీమ్ రావు భారత్ పార్టీ(జేబీపీ) పల్నాడు జిల్లా
అధ్యక్షుడు,న్యాయవాది జొన్నలగడ్డ విజయ్ కుమార్ పిలుపు.

బహుజన రాజ్యాధికారంలో యువతీ, యువకులు, మహిళలు ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని జై భీమ్ రావు భారత్ పార్టీ(జేబీపీ)పల్నాడు జిల్లా అధ్యక్షుడు, న్యాయవాది జొన్నలగడ్డ విజయ్ కుమార్ పిలుపునిచ్చారు. మంగళవారం మధ్యాహ్నం ముప్పాళ్ళ ఎస్సీ కాలనీలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణాల్లో పేదలైన బహుజనులు నేటికీ సమాజానికి దూరంగా దుర్భర జీవితాన్ని గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానత్వం కోసం డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్, మహాత్మ జ్యోతిరావు పూలే, కాన్షిరామ్ నిరంతరం శ్రమించారన్నారు. మనం కూడా వారి బాటలో పయనిస్తూ రాజ్యధికారం…., అధికారంలో భాగస్వాముల కోసం పాటుపడుదామని పిలుపునిచ్చారు. బహుజనులు రాయితీలు కోసం కాకుండా రాజ్యాధికారం కోసం పోరాడుదామని పేర్కొన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ తరుపున నేను సత్తెనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి గా పోటీ చేస్తున్నానని మీ ఆశీర్వాదం మీ మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. సమావేశంలో కందుల అంబేద్కర్, రాజశేఖర్, రాజేష్, సంపతమ్మ,రాణి, నవ్య, ప్రశాంతి, చిలకా రవి, మన్నెం కోటేశ్వరరావు, గద్దల కోటేశ్వరరావు, రామ్ తేజ్, కొమెరిగుంట మోహన్ రావు, బంకా కళ్యాణి, దొప్పలపూడి రవి తదితరులు పాల్గొన్నారు.