సమాజ సేవకులకు పురస్కారాలు

సమాజ సేవకులకు పురస్కారాలు

తిరుపతి( భారత్ న్యూస్ )నవ సమాజ ఫెడరేషన్ 13 వ వార్షికోత్సవ వేడుకలను వ్యవస్థపాక జాతీయ అధ్యక్షులు నీరుగట్టు నగేష్ ఆధ్వర్యంలో ఎస్ వి యూనివర్సిటీ శ్రీనివాస ఆడిటోరియం నందు ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంకి ముఖ్య అతిధిలుగా పద్మావతి మహిళా యూనివర్సిటీ మాజీ రిజిస్ట్రార్ మమత,పద్మావతి డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ నారాయణమ్మ,కస్తూర్బ గాంధీ ట్రస్ట్ చైర్మన్ పి సి రాయల్ చదలవాడ సుచరిత,జ్యోతి ప్రకాష్,మల్లీశ్వరి దాసాజీ, వెంకట చలపతి,కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫెడరేషన్ వ్యవస్థాపకులు కోడివాక చెందు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో లో 13వ వార్షికోత్సవం సందర్బంగా వివిధ రంగాలలో ప్రముఖలు 13 మందికి అవార్డులను ప్రధానం చేశారు. అవార్డులు తీసుకున్న వారిలో ప్రముఖులు ప్రొఫెసర్ బి వి మురళీధర్ కి రాజనీతి ఆచార్య రత్న అవార్డు,ప్రవీణ్ ఇన్స్టిట్యూట్ అఫ్ పారామెడికల్ చైర్మన్ వై ప్రవీణ్ కు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాలు 100 పైగా బహుకరించినందుకుగాను డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ఆదర్శ రత్న అవార్డు,విశ్వం విద్యాసంస్థల అధినేత ఎన్ విశ్వనాధ్ రెడ్డి కి విద్యా రత్న అవార్డు,డాక్టర్( చిన్ని రాయల్ ) కి సేవా రత్న అవార్డు,ఉత్తమ విద్యార్థులకు అవార్డ్స్ ఇవ్వడం జరిగింది.విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు మరియు విజయ్ ఉత్తరాది మిమిక్రీ అలరింప జేసింది.ఈ కార్యక్రమంలో యన్.ఎస్ ఎఫ్ నేతలు నందిని ,యం.రమేష్,కిరణ్ కుమార్ రెడ్డి,నీల విజయ భాస్కర్,జయచంద్ర,నాగార్జున ,రాజేష్ రాయల్,సి.వై.ఎస్.ఎస్.రాష్ట్ర అద్యక్షులు జగదీష్,యస్.వి.యూనివర్సిటీ జేఏసీ చైర్మన్ బి.మురళి కృష్ణ,భారత్,హరీష్ తదితరులు పాల్గొన్నారు.