Chief Minister YS Jagan Mohan Reddy – MLA Simhadri Ramesh Babu who never miss a word

భారత్ న్యూస్ ఘంటసాల

మాట తప్పని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి – ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు

:- రూ.3వేల వైఎస్సార్ పెన్షన్ కానుక పంపిణీ చేసిన ఎమ్మెల్యే

ఘంటసాల :-

ఎన్నికల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని మరోసారి ప్రజలంతా ఆయన్ను దీవించాలని ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు అన్నారు.

ఘంటసాల మండల పరిషత్ కార్యాలయం వద్ద వైఎస్సార్ పెన్షన్ కానుక పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి మంగళవారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమేష్ బాబు మాట్లాడుతూ కుల, మత, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.

ఘంటసాల మండలంలో నూతనంగా 86 పెన్షన్లు మంజూరు కాగా మొత్తం 7331 పెన్షనర్లకు రూ.2,10,81,000 అందించడం జరుగుతుందన్నారు.

ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్న మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి తర్వాత ఆయన తనయుడు వైయస్ జగన్ మాత్రమే అన్నారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ద్యేయంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి జగన్ ను ప్రజలంతా ఆశీర్వదించాలన్నారు.