భారత్ న్యూస్ విజయవాడ,
కృష్ణాజిల్లా గ్రంథాలయ సంస్థ శాఖ గ్రంథాలయము ముస్తాబాద్ నందు 56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవంలో భాగంగా రెండవ రోజు అయిన ది:15-11-2023వ తేదీ బుధవారం ఉదయం 10 గంటలకు పుస్తక ప్రదర్శన కార్యక్రమమును నిర్వహించడమైనది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీమతి అన్నవరపు ఎల్జిబెత్ రాణి గారు జడ్పిటిసి సభ్యులు గన్నవరం వారు బుక్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించినారు. తదుపరి శ్రీమతి అన్నవరపు ఎల్జిబెత్ రాణి గారికి మెమొంటోను ను బహుకరించి శాలువాతో సన్మానించడ మైనది. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు షేక్ ఇమామ్ గారు, శ్రీమతి పార్వతి గారు మరియు ఉర్దూ స్కూలు హెచ్ఎం ఖాసిం గారు, జడ్పీహెచ్ఎస్ స్కూల్ ఉపాధ్యాయులు డి. గణపతి రావు గారు వేదికను అలంకరించినారు.
శ్రీమతి అన్నవరపు ఎల్జిబెత్ రాణి ZPTC గారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రతి విద్యార్థిని విద్యార్థులు గ్రంధాలయాన్ని ఉపయోగించుకోవలసినదని దా…