పద్మశాలి ఉద్యోగుల సంక్షేమ సంఘం, శ్రీకాకుళం జిల్లా శాఖ ఆధ్వర్యంలో 2024 సంవత్సరానికి సంబంధించి డైరీ, క్యాలెండర్ ను బుధవారం ఆవిష్కరించారు

పద్మశాలి ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డైరీ, కేలండర్ ఆవిష్కరణ భారత్ న్యూస్,
శ్రీకాకుళం,డిసెంబర్ 27:

పద్మశాలి ఉద్యోగుల సంక్షేమ సంఘం, శ్రీకాకుళం జిల్లా శాఖ ఆధ్వర్యంలో 2024 సంవత్సరానికి సంబంధించి డైరీ, క్యాలెండర్ ను బుధవారం ఆవిష్కరించారు. సంఘ ప్రముఖులు, రాగోలు జెమ్స్ మెడికల్ కాలేజ్ అనాటమీ ప్రొఫెసర్, ప్రముఖ వైద్యులు రేఖల మల్లేశ్వరరావు వీటిని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక బలోపేతంతో పాటు సామాజిక కార్యక్రమాలకు సంఘ సభ్యులు కృషి చేయాలని సూచించారు. పద్మశాలి సామాజిక వర్గంలో వెనుకబడిన వ్యక్తులను కుటుంబాలను ఆర్థికంగా ఆదుకొని వారి అభ్యున్నతికి దోహదపడేలా సంఘ కార్యకలాపాలు రూపొందించాలని సూచించారు . ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్, డాక్టర్ పున్న రంగస్వామి , సంఘ రాష్ట్ర కార్యదర్శి యేసో శ్రీనివాసులు, యువజన విభాగం అధ్యక్షులు తీడ ప్రసాదరావు, పీ ఈ డబ్ల్యూ ఏ సెక్రటరీ గిడుతూరి నీలాద్రిరావు, ఉపాధ్యక్షులు నూలు వెంకటరావు, కోశాధికారి గిడుతూరి చలపతిరావు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పందిరి చిన్నారావు, జిల్లా కార్యవర్గ సభ్యులు దూబ పాపారావు, పందిరి రామారావు, జిల్లా పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు యిమంది విశ్వేశ్వరరావు , కార్యవర్గ సభ్యులు జగిలింకి జగన్నాధం తదితరులు పాల్గొన్నారు..