వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయం కోరుతూ ప్రత్యేక ప్రార్థనలు.

భారత్ న్యూస్ విజయవాడ:-

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయం కోరుతూ ప్రత్యేక ప్రార్థనలు.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో పార్టీ అధికారం చేపట్టాలని ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు.

చల్లపల్లి పడమర వీధిలోని గోసియా పార్క్ దర్గా వద్ద శుక్రవారం ఉదయం పార్టీ మైనారిటీ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి పఠాన్ కరిముల్లా ఖాన్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ డైరెక్టర్ దిల్షాద్ నజరానాల ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

ముఖ్యమంత్రిగా మళ్లీ జగన్ అధికారం చేపట్టాలని ఆకాంక్షించారు. అవనిగడ్డ నియోజకవర్గ పార్టీ అభ్యర్థి సింహాద్రి రమేష్ బాబు, మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ రావు లు అఖండ విజయంతో సాధించాలని అల్లా ప్రభువుని ప్రార్థించారు. ప్రజలకు మంచి చేసే జగన్ తిరిగి మళ్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాలన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ ముస్లిం మైనార్టీ సెల్ విభాగం ప్రధాన కార్యదర్శి సయ్యద్ సికిందర్, పెద్ద సంఖ్యలో ముస్లిం మైనారిటీ మహిళలు పాల్గొన్నారు.