భారత్ న్యూస్ విజయవాడ…మార్కాపురం నియోజకవర్గంలో శ్రీ Pawan Kalyan గారు పర్యటన
📍4వ తేదీన నరసింహపురంలో తాగు నీటి పథకం పనులకు శంకుస్థాపన, బహిరంగ సభ
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, ఆర్.డబ్ల్యూ.ఎస్. శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ నెల 4వ తేదీ ఉదయం ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గంలో పర్యటిస్తారు.
జిల్లాకు సంబంధించి రూ.1290 కోట్ల విలువైన అతి పెద్ద తాగు నీటి పథకం పనులకు నరసింహపురం గ్రామంలో శంకుస్థాపన చేస్తారు.
10 లక్షల మందికి తాగు నీటిని అందించేలా ప్రణాళికలు రూపొందించారు.

అనంతరం ఉదయం 10 గం.కి నిర్వహించే బహిరంగ సభలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రసంగిస్తారు.