కేంద్రం కొత్త రూల్స్.. రూ.50 వేల లావాదేవీలపై పాన్ కార్డ్ తప్పనిసరి

భారత్ న్యూస్ గుంటూరు…కేంద్రం కొత్త రూల్స్.. రూ.50 వేల లావాదేవీలపై పాన్ కార్డ్ తప్పనిసరి

ఆర్థిక లావాదేవీలలో పారదర్శకత కోసం కేంద్ర ప్రభుత్వం పాన్ కార్డ్ నిబంధనలలో భారీ మార్పులు చేసింది.

ఇకపై రూ.50 వేలు దాటిన అన్ని లావాదేవీలకు పాన్ కార్డ్ తప్పనిసరి చేసింది.

కారు, బైక్, బంగారం, భూమి, ఇల్లు కొనుగోలు, డీమ్యాట్ ఖాతా తెరవడం, మ్యూచువల్ ఫండ్స్, బాండ్లు, డిబెంచర్లలో పెట్టుబడులు, రూ.10 లక్షలకు మించిన నగదు డిపాజిట్లు, విత్ డ్రాలు, రూ.లక్ష దాటి చేసే సెక్యూరిటీ కొనుగోళ్లకు పాన్ తప్పనిసరి.

ఏప్రిల్ 1 నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి.

ఫామ్ 60, 61 స్థానంలో ఫామ్ 97, 98 తీసుకొచ్చారు.