భారత్ న్యూస్ గుంటూరు…దక్షిణ కోస్తా ఆంధ్రా నుండి వీస్తున్న పొడి గాలుల కారణంగా ఈరోజు కూడా రాయలసీమలో ఎండల తీవ్రత కొనసాగుతూ ఉష్ణోగ్రతలు 41-42 డిగ్రీల నుండి 43 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగే అవకాశం ఉండటంతో పాటు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కడప మరియు కర్నూలు నగరాల పరిసరాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కానుండగా, రేపు ఎండ మరింత పెరిగే సూచనలు ఉన్నాయి, అలాగే విశాఖపట్నం పరిసరాల్లో ఉక్కపోత వాతావరణం ఉండగా, తిరుపతి నగర తూర్పు భాగంలో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలతో వాతావరణం పూర్తిగా పొడిగా ఉండనుంది.
