తిరుపతి దర్శనం పేరిట విశ్రాంత ఉద్యోగిని మోసం చేసిన పూజారి

భారత్ న్యూస్ తిరుపతి…తిరుపతి దర్శనం పేరిట విశ్రాంత ఉద్యోగిని మోసం చేసిన పూజారి

తిరుపతి టిక్కెట్లు బుక్ చేస్తానని ఫోన్ తీసుకుని రూ.18.46 లక్షలు బదిలీ చేసుకున్న పూజారి

కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఓద్వారం గ్రామంలోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి ప్రతి రోజు దర్శనానికి వెళ్తున్న ఒక విశ్రాంత ఉద్యోగితో పరిచయం ఏర్పరచుకున్న సాయి తరుణ్ అనే ఆలయ పూజారి

తిరుపతి దర్శనం, ట్రైన్ టిక్కెట్లు బుక్ చేస్తానని బాధితుడి ఫోన్ తీసుకుని, పాస్వర్డ్ తెలుసుకుని, మేసేజీలు రాకుండా చేసిన సాయి తరుణ్

తిరుపతి దర్శనం టికెట్ల పేరుతో ప్రతిరోజూ ఫోన్ తీసుకుని, బాధితుడి ఖాతా నుండి 30 విడతల్లో రూ.18.46 లక్షల రూపాయలను దామెర హరీష్ అనే వ్యక్తికి పంపిన పూజారి

డబ్బులు అవసరమయ్యి బ్యాంకుకు వెళ్లగా, అకౌంట్లో డబ్బులు లేవని అధికారులు చెప్పడంతో స్టేట్మెంట్ తీసి చూడగా, రోజు ఉదయం 9 గంటల లోపు రూ.99,999 బదిలీ అయినట్లు గుర్తించి పోలీసులను ఆశ్రయించిన బాధితుడు

హరీష్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని, పరారీలో ఉన్న పూజారిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేస్తున్న పోలీసులు