భారత్ న్యూస్ ఢిల్లీ…..న్యూ ఢిల్లీ:డిసెంబర్ 06
భారత రూపాయి మారకం విలువ అమెరికన్ డాలర్ తో పోలిస్తే జీవనకాల కనిస్టాలకు పతనమవు తుంది, రూపాయి విలువ 90- 70, 91, మార్కును తాకనుందని మార్కెట్ విశ్లేషకులు అంచన వేస్తున్నారు.
ఈ పరిణామాల నేపథ్యం లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం కీలక వ్యాఖ్యలు చేశారు. హిందుస్థాన్ టైమ్స్ లీడర్ షిప్ సదస్సులో ఆమె రూపాయి పతనం పై మాట్లాడారు.
రూపాయి విలువ పెరిగేం దుకు ప్రభుత్వం తరపున లేదా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరపున ప్రత్యే కంగా ఎలాంటి లక్ష్యాలను నిర్దేశించలేదని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. రూపాయి విలువ ను కృత్రిమంగా నియంత్రిం చడానికి ప్రయత్నించడం సరికాదు.. అంతర్జాతీయ మార్కెట్లో ఏర్పడే డిమాండ్, సరఫరా ఆధారంగానే సరైన విలువ దొరుకుతుందని ఆమె పేర్కొన్నారు.
ఇదే క్రమంలో రూపాయి పతనం పూర్తిగా ప్రతికూల మేమీ కాదని వెల్లడించారు. ఈ పరిస్థితులు ఎగుమతి దారులకు ప్రయోజనకర మేనని వెల్లడించారు. రూపాయి విలువలో అధిక హెచ్చుతగ్గులు ఏర్పడి దేశ ఆర్థిక స్థిరత్వానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నప్పుడు, మార్కెట్ను స్థిరీకరించేందుకు మాత్రమే ఆర్బీఐ రంగంలోకి దిగుతుందని నిర్మలా సీతారామన్ వివరించారు.
ప్రపంచ వ్యాప్తంగా అనేక ఆర్థిక వ్యవస్థలు ద్రవ్యోల్బణం, అధిక వడ్డీ రేట్లతో పోరాడుతున్నా యని, ఈ సమయంలో అన్ని దేశాల కరెన్సీలపైనా ఒత్తిడి ఉందని ఆమె చెప్పా రు.ఈ గ్లోబల్ అనిశ్చితి భారత రూపాయిపై కూడా ప్రభావం చూపుతున్నప్ప టికీ.. ఇతర అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందు తున్న దేశాల కరెన్సీలతో పోలిస్తే భారత రూపాయి మెరుగ్గా, స్థిరంగా ఉందని నిర్మలా సీతారామన్ అభిప్రాయపడ్డారు.
