రోడ్లు సరిగా లేకుంటే పన్ను చెల్లించం.. కాంగ్రెస్‌ సర్కారుకు బెంగళూరు ప్రజల హెచ్చరిక

భారత్ న్యూస్ విజయవాడ…రోడ్లు సరిగా లేకుంటే పన్ను చెల్లించం.. కాంగ్రెస్‌ సర్కారుకు బెంగళూరు ప్రజల హెచ్చరిక

ఇవేం రోడ్లు, ఇవేం డ్రైనేజీల నిర్మాణం? ఒక ప్రణాళిక, పద్ధతి లేదా?, నిర్మాణంలో శాస్త్రీయ విధానాలు పాటించరా? అంటూ బెంగళూరు తూర్పు ప్రాంత వాసులు కర్ణాటకలోని కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

చిన్నపాటి వర్షానికే ముంచుతున్న వరదలు, అస్తవ్యస్తంగా ఉన్న రోడ్డు సంబంధిత పనులు, ప్రణాళిక లేని పౌర ప్రాజెక్టులపై వారు మండిపడ్డారు. తమకు ప్రాథమిక మౌలిక సదుపాయాలను పునరుద్ధరించే వరకు ఆస్తి పన్ను వసూళ్లను నిలిపివేయాలని ముఖ్యమంత్రిని డిమాండ్‌ చేశారు.