శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని జూబ్లీహిల్స్ నివాసం కలిసిన.లక్ష్మారెడ్డి గారు 2 కోట్ల రూపాయల చెక్కును అందజేశారు

భారత్ న్యూస్ హైదరాబాద్….ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని జూబ్లీహిల్స్ నివాసం కలిసిన మిర్యాలగూడ శాసనసభ్యుడు బత్తుల లక్ష్మారెడ్డి గారు 2 కోట్ల రూపాయల చెక్కును అందజేశారు. కుమారుడి వివాహ రిసెప్షన్ కోసం ఖర్చు చేయాలనుకున్న డబ్బును నియోజకవర్గంలోని రైతులకు ఉపయోగపడే కార్యక్రమంగా మార్చుకోవాలని భావించి 2 కోట్ల రూపాయల చెక్కును ముఖ్యమంత్రి గారికి అందించారు.

లక్ష్మారెడ్డి గారు కుటుంబ సభ్యులు, నల్గొండ లోక్‌సభ సభ్యులు కుందూరు రఘువీర్ గారితో వచ్చి ముఖ్యమంత్రి గారిని కలిసి చెక్కును అందించారు. ఆ డబ్బును మిర్యాలగూడ నియోజకవర్గంలోని రైతుల కోసం ఖర్చు చేయాలని విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గంలో దాదాపు లక్ష మంది రైతులకు ఒక్కొక్కరికి ఒక్కో యూరియా బస్తా ఉచితంగా అందజేయాలని కోరారు.

లక్ష్మారెడ్డి గారు తన కుమారుడు సాయి ప్రసన్న వివాహ రిసెప్షన్ మిర్యాలగూడలో నిర్వహించాలని భావించినప్పటికీ దాన్ని రద్దు చేసుకుని ఆ డబ్బును రైతులకు ఉపయోగపడే కార్యక్రమం చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. రైతులకు ప్రయోజనం కలిగించే ఒక మంచి నిర్ణయం తీసుకున్నారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారిని, వారి కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి గారు అభినందించారు.