భారత్ న్యూస్ మచిలీపట్నం……Ammiraju Udaya Shankar.sharma News Editor…విజయవాడ
వైఎస్ షర్మిలా రెడ్డి
APCC చీఫ్
ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షలు పరిహారం అందించాలని డిమాండ్ చేస్తున్నాం.
కూటమి ప్రభుత్వ వైఫల్యానికి తురుకపాలెం మరణ మృదంగమే నిదర్శనం.
గత 5 నెలలుగా వరుస మరణాలు సంభవిస్తుంటే వైద్యారోగ్య శాఖ ఈ రాష్ట్రంలో ఉన్నట్లా ? లేనట్లా ?
ఇప్పటిదాకా 35 మంది ఒకేవిధంగా మృత్యువాత పడితే కారణం కనుక్కొని అరికట్టక పోవడం సిగ్గుచేటు.
అంతుచిక్కని వ్యాధి ఇంకా ఎంతమందిని బలి గోరుతుందోనని గ్రామస్థులు హడలిపోతుంటే …
ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం దారుణం.
ప్రజలు ప్రాణభయంతో విలవిల్లాడుతుంటే మహమ్మారిని అదుపు చేయకపోవడం అత్యంత బాధాకరం.
కూటమి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.
తురుకపాలెం మృత్యుఘోషపై వెంటనే స్పందించండి.
వైద్యారోగ్య శాఖ పరంగా తక్షణం ఉన్నతస్థాయి కమిటీ వేయండి.
గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి అన్ని రకాల మెడికల్ టెస్టులు నిర్వహించండి.
పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేయండి .
మరణాలకు కల్తీ నీళ్లు కారణమా ? కల్తీ లిక్కర్ తో సంభవిస్తున్న మరణాలా ?
లేక గ్రామంలో పారిశుద్ధ్య లోపమా ? ఇంకేమైనా కారణం ఉందా ?
వెంటనే తేల్చి నివారణ చర్యలు చేపట్టండి.
సకాలంలో ప్రభుత్వం స్పందించని కారణంగా జరిగిన మరణాలకు భాద్యత వహించి ..
