భారత్ న్యూస్ తిరుపతి..తిరుమలలో నిండిపోయిన కంపార్ట్మెంట్లు
తిరుమల :
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేనివారికి శ్రీవారి సర్వ దర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. మరోవైపు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి వెలుపల క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 67,284 మంది భక్తులు దర్శించుకోగా 31,268 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.34 కోట్లు వచ్చినట్లు టీటీడీ
అధికారులు తెలిపారు.
