ATM నుంచి PF.. ఎప్పటినుంచంటే

భారత్ న్యూస్ హైదరాబాద్…ATM నుంచి PF.. ఎప్పటినుంచంటే

EPFO తన చందాదారుల కోసం ‘EPFO 3.0’ అప్ గ్రేడ్లో భాగంగా విప్లవాత్మక మార్పులు చేస్తోంది. మే చివరికల్లా ఏటీఎం లేదా యూపీఐ ద్వారా నేరుగా PF నిధులు విత్ డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించనుంది.

దీనికోసం ప్రత్యేక ఏటీఎం కార్డులను అందించనుండగా, మొత్తం నిల్వలో 50 శాతం వరకు మాత్రమే తీసుకునేలా పరిమితి ఉండనుంది.

ఈ సేవలకు యాక్టివ్ UAN, ఆధార్, బ్యాంక్ ఖాతా అనుసంధానం తప్పనిసరి.