నియోజకవర్గ స్థాయి విజేతలకు అభినందనలు తెలిపిన ‘బొంతు’ భారత్ న్యూస్
లావేరు ,ఫిబ్రవరి 12 :
ఆడుదాం ఆంధ్రా బ్యాడ్మింటన్ టోర్నీ లో ఎచ్చెర్ల నియోజకవర్గ స్థాయి లో ట్రోఫీ తో పాటు గా 20 వేలు రూపాయల నగదు గెలుపొందిన వెంకటాపురం క్రీడాకారిణిలు నెల్లి దివ్య ,మీసాల శ్రావణి లను వెంకటాపురం సర్పంచ్ బొoతు యల్లoనాయుడు ప్రత్యేకంగా అభినందించారు. ఈ విజేతలు వెంకటాపురం పాఠశాల పేరును నిలబెట్టారని, వీరికి భవిష్యత్తులో తన సహకారం ఎల్లవేళలా ఉంటుందని ఆయన అన్నారు.