రాష్ట్ర రెజ్లింగ్ పోటీలకు తిరుపతి జిల్లా జట్టు ఎంపిక

తిరుపతి (భారత్ న్యూస్ )స్థానిక శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ నందు మంగళవారం తిరుపతి జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్ 20 రాష్ట్ర రెజ్లింగ్ పోటీలకు జట్టు ఎంపిక కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షులు ఎలమంచిలి ప్రవీణ్,కార్యదర్శి ఆర్ శ్రీధర్,తిరుపతి డి.ఎస్.డి.ఓ సయ్యద్ సాహెబ్ విచ్చేశారు.ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ రెజ్లింగ్ క్రీడాకారులు దేహదారిద్యంతోపాటు మానసికంగా కూడా దృఢంగా ఉన్నట్లయితే పోటీలలో మంచి ఫలితాలు సాధిస్తారని అదేవిధంగా క్రీడాకారులు అందరూ ప్రతి రోజు ప్రాక్టీస్ చేయడం వల్ల మంచి ఫలితాలు సాధిస్తారని అన్నారు.ఈ పోటీలలో ఎన్నికైన జట్టు వివిధ విభాగాలలో బి సాయి తేజ,ఏ హేమంత్ ,ఎన్.గోపి,కే.భార్గవ్ నందకుమార్,పి సుమన్,టి మహేష్,ఏ ఆనంద్,డి లీలా మోహన్,పృద్వి ,ఎన్.జ్యోతి ప్రకాష్,పి.కార్తీక్,ఎస్.మహేష్ ,ఏ. నాగరాజు ,బి.రాజేష్ తదితరులు ఈనెల 20,21వ తేదీలలో చిత్తూరు నందు జరిగే రాష్ట్ర రెజ్లింగ్ పోటీలలో పాల్గొన నున్నార నీ రెజ్లింగ్ అసోసియేషన్ తిరుపతి జిల్లా కార్యదర్శి బి ఉదయ్ కుమార్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో రెజ్లింగ్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్.సురేష్,గోపి నాయుడు తదితరులు పాల్గొన్నారు.