Children’s Christmas Celebrations. House of Prayer Welfare Society and

భారత్ న్యూస్ విజయవాడ,

చిల్డ్రన్ క్రిస్మస్ సెలబ్రేషన్స్
. హౌస్ ఆ ఫ్ ప్రేయర్ వెల్ఫేర్ సొసైటీ మరియు అరుణోదయ స్వచ్ఛంద సేవా సంస్థ సంయుక్తంగా నిర్వహించిన చిల్డ్రన్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ,ఆముదాలవలస పట్టణంలో ధర్మారావు కోటర్స్ లందు హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చ్ ఆవరణంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి మండలం నుండి మున్సిపాలిటీ నుండి బాలబాలికలు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. కులమతాలకు అతీతంగా ప్రపంచం యావత్తు జరుపుకునేటటువంటి ఏసుక్రీస్తు జన్మదిన పురస్కరించుకొని, ఈ క్రిస్మస్ వేడుకలు ద్వారా పిల్లలను ఆశీర్వదిస్తూ మంచి భవిష్యత్తు వారికి కలగాలని ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన పోటీలను నిర్వహించి వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన స్థానిక సంస్థ డైరెక్టర్ రెవరెండ్ సామ్యూల్ అరుణ్ కుమార్ నిర్వాహకులు అరుణ్ రాజ్ నిర్వాహకులు అహరోన్ రాజ్, గౌతమ్ ,సంసోన్, పేతురు బోర్నో మహేష్, స్వాతి తదితరులు పాల్గొన్నారు కేక్ కటింగ్ సర్వీస్ ద్వారా కొరియోగ్రఫీ ద్వారా పిల్లలు ఈ క్రిస్మస్ సంబరాలు జరుపుకున్నారు .ఇలాంటి చిల్డ్రన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ద్వారా ట్యూషన్ సెంటర్స్ క్రీడల్లో పిల్లలకు విద్య మానసిక ఉల్లాసాన్ని కలిగించేటటువంటి విధంగా సంస్థ పనిచేస్తుందని తెలియజేశారు