on the orders of mla vallabhaneni vamsimohan, zptc examined the

భారత్ న్యూస్ విజయవాడ,

కృష్ణ జిల్లా కలెక్టర్ పి. రాజబాబు గారు.పంచాయితీ రాజ్ వారికి అంచనాలు వేయమని ఆదేశాల మేరకు కొలతలు వేసిన సిబ్బంది.

గన్నవరం గ్రామ దలితవడలోని dr అంబేత్కర్ భవనం శిథిలావస్థకు చేరటంతో ఆ ప్రాంత ప్రజలు కోరిక మేరకు స్థానిక ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ గారి ఆదేశంతో గన్నవరం జెడ్పీటీసీ సభ్యురాలు అన్నవరపు ఎలిజా బెత్ రాణి జిల్లా కలెక్టర్ గారికి ప్రజలు ఇచ్చిన ఆర్జీని ఇవ్వగా వెంటనే స్పందించి ఈ రోజు పంచాయతీ రాజ్ శాఖ స్టాఫ్ తో గన్నవరం దళితవాడ అంబేద్కర్ భవనము యొక్క కొలతలు వేయడం జరిగింది భవనము ప్రజలు కోరిన దానికి అనుగుణంగా మొత్తం రు 17 లక్షలు అంచనా వేయటం జరిగిందనీ ఈ కార్యక్రమం పరిశీలించాటనికి వచ్చిన గన్నవరం మండల జడ్పీటీసీ సభ్యురాలు అన్నవరపు ఏలిజిబెత్ రాణి అన్నారు. ఆమె మాట్లాడుతూ మన ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ గారి ఆదేశంతోనే వెంటనే స్పందించి అధికారులను ఆదేశించినట్లు ఆమె
తెలిపారు ఎస్టిమేట్ కాపీ అందిన వెంటనే ఎమ్మెల్యే గారితో మాట్లాడి జిల్లా కలెక్టర్ గారికి ఇస్తానని అక్కడ పాల్గొన్నా వారికి జెడ్పీటీసీ గారు చెప్పటం జరిగింది.ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ తిరివిధి రవి గారు మరియు యమ్ ఈ యఫ్ గన్నవరం అధ్యక్షులు బొకినాల కోటేశ్వరరావు గారు, డి జె ఆర్ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రసాద్ గారు, సచివాలయం 4 ఇంజినీరింగ్ అసిస్టెంట్ శిరీష గారు, రిటైడ్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గన్నవరం కాటూరి వెంకటేశ్వరరావు గారు, మోటుపల్లి సుధాకర్ (దాని) గారు , సోడబత్తిన రంగరావు గారు, వల్లూరి చక్రవర్తి
గ్రామస్తులు, పెద్దలు, తదితరులు పాల్గొన్నారు