మెగా డీఎస్సీ తక్షణమే విడుదల చెయ్యాలి__
ఈరోజు అనంతపురం నందు మెగా డీఎస్సీ విడుదల చేయాలని విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో నిరుద్యోగుల ర్యాలీ నిర్వహించడం జరిగింది ఇందులో ముఖ్యంగా ఐసా రాష్ట్ర అధ్యక్షులు వేమన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గతంలో డీఎస్సీ అభ్యర్థులకు ఇచ్చిన మాట ప్రకారం తక్షణమే మెగా డీఎస్సీ విడుదల చేయాలని డిమాండ్ చేయడం జరిగింది ఇప్పటికే దాదాపు ఐదు సంవత్సరాలు అవుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ అభ్యర్థులను మోసం చేయడానికి పూర్తిగా ఖండించడం జరుగుతుంది ,ఎందుకంటే విద్యా శాఖ మంత్రి నెలకొక తారీకు చెప్పుకుంటూ డీఎస్సీ నోటిఫికేషన్ ను అవహేళన చేసుకుంటూ పోవడాన్ని గమనించాలి ఇప్పటికే వేలాది మంది నిరుద్యోగులు లక్షలాది రూపాయలు ఖర్చుపెట్టి కోచింగ్ సెంటర్లలో మగ్గుతున్న ఈ ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు ప్రభుత్వం మాత్రం నాడు నేడు కింద ప్రతి పాఠశాలలను అభివృద్ధి చేశామంటూ గొప్పలు చెప్పుకుంటూ ఆ పాఠశాలలో ఉపాధ్యాయ పోస్టులు మాత్రం భర్తీ చేయడం లేదు ఎన్నికల సమయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి ప్రతి వీధిలో ప్రతి మీటింగ్ లో ప్రతి అజెండాలో డీఎస్సీ అభ్యర్థులకు వైయస్సార్ ప్రభుత్వం రాగానే మెగా డిఎస్సి ని విడుదల చేసి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తానంటూ తప్పుడు మాటలు చెప్పడాన్ని గమనించాలి కాబట్టి ఇప్పటికైనా నిరుద్యోగులు ఉసురు తగలక ముందే తక్షణమే మెగా డీఎస్సీ ని విడుదల చేయాలని విద్యార్థి యువజన సంఘాలు డిమాండ్ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యు జిల్లా కోశాధికారి బండారు శంకర్ రివ్యులుషనరీ యూత్ అసోసియేషన్ జిల్లా కన్వీనర్ మల్లికార్జున నాయకులు ఇస్మాయిల్, నాగేంద్ర , పుల్లలరేవు మంజునాథ్ మరియు డీఎస్సీ అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు.