Ghanangachatrapati Shivaji Maharaj Jayanti

ఘనంగాచత్రపతి శివాజీ మహారాజ్ జయంతి

భారత్ న్యూస్ : జగిత్యాల జిల్లా కోరుట్ల లో ఘనంగా ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి వేడుకల్లోమనిషి మనిషిగా బ్రతికే సమాజం కావాలని ఒకరిని హింసించే హక్కు ఇంకొకరికి లేదు అని మనుషులంతా సమానమే అంటూ సబ్బండ వర్గాల పక్షాన నిలబడి మతముసుగులో కులం ముసుగులో అణచివేతకు పాల్పడుతున్నదుర్మార్గులపై యుద్ధం చేసి సామాన్యులకు అండగా నిలిచిన మహావీరుడు చత్రపతి శివాజీ అంటూ వక్తలు కొనియాడారు..

సోమవారం రోజున శ్రీ ప్రభాకర్ గ్రంథాలయం కోరుట్ల ఆధ్వర్యంలో చత్రపతి శివాజీ మహారాజ్ 394 వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఆయన సైన్యంలో 30% మంది మైనార్టీలను అంగరక్షకులు ఉన్నారని వివరించారు, దుర్మార్గమైన వ్యవస్థను రద్దు చేసిన స్త్రీల పక్షాతి చత్రపతి శివాజీ అని కొనియాడారు, బ్రాహ్మణియ శక్తులు దేశములవాసి చత్రపతి శివాజీకి రాజము ఏలే అర్హత లేదన్నారు, కరువు కాటకాలు సంభవించినప్పుడు పనులను రద్దు చేసిన గొప్ప మానతవాది శివాజీ అని అన్నారు, శివాజీ శూద్రుని కారణంగా రాజ్యపట్టాభిషేకానికి నిరాకరించిన మరాఠీ బ్రాహ్మణ పురోహితులు కాశి నుండి వచ్చిన గగాబట్ పండితుడు తన కాలి బొటనవేలుతో శివాజీ తిలకం దిద్ది న అవమన పరిచిన చరిత్ర మర్చిపోదు, రైతులకు వ్యవసాయ పనిముట్లు రుణాలను అందజేసి వడ్డీ లేకుండా నాలుగు సంవత్సరాలలో రుణాలు కట్టెల సంస్కరణలు చేసి రైతులకు భరోసానిచ్చిన తిరుపతి శివాజీ, శివాజీకి ఖడ్గాన్ని భవాని మాత ఇచ్చిందని తప్పుడు ప్రచారాన్ని తిప్పికొడదాం. అది పోర్చుగీస్ వారిది దానిపై పోర్చుగీస్
లిపిఉంది. శివాజీ నేటి యువతకి ఆదర్శమని అతని సేవలు కొనిఆడారు

ఈ సమావేశంలో చెన్న విశ్వనాథం రాస భూమయ్య సుతారి రాములు రామకృష్ణ శ్రీహరి పేట భాస్కర్ పసుల కృష్ణ భూపెల్లి నాగేష్ ప్రేమ్ సాగర్ రాంబాబు సమీర్ వంశీకృష్ణ రమేష్ సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు