Giving Journalism Journalists Books to Mylavaram Press Club:

భారత్ న్యూస్ విజయవాడ…

ఎన్టీఆర్ జిల్లా మైలవరం:

*మైలవరం ప్రెస్ క్లబ్ కు జర్నలిజం జర్నలిస్టుల పుస్తకాల బహుకరణ :

సీనియర్ జర్నలిస్టు, రచయిత ఈ పూరి రాజారత్నం రచించిన జర్నలిజం జర్నలిస్టులు (పరిశోదాత్మక కథనాలు ) పుస్తకాలను మైలవరం ప్రెస్ క్లబ్ కుబహుకరించారు…

ఈ పుస్తకాలను ప్రెస్ క్లబ్ సభ్యులు మాజీ ఉపాధ్యక్షులు వీసం సురేష్ బాబుకు అందజేయగా ఆయన మైలవరం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు బొడ్డు విజయబాబుకు అందించారు… ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధ్యక్షులు విజయబాబు మాట్లాడుతూ జర్నలిస్టులో జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలు మరియు పరిశోధనాత్మక కథనాలను ఈ పుస్తకంలో రచయిత రాజరత్నం పొందుపరిచారని… ప్రతి ఒక్క జర్నలిస్టు ఈ పుస్తకాన్ని చదవాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి గుంజి నాగరాజు, ఉపాధ్యక్షులు పల్ల వెంకటరత్నం సభ్యులు పాల్గొన్నారు.