jaya pradham district first mahasabha of building

భవన నిర్మాణ కార్మికుల జిల్లా ప్రధమ మహాసభలను జయప్రదం చేయండి

పాకాల ( భారత్ న్యూస్ ) పాకాల భారతం మిట్ట నందు ఏఐటీయూసీ చంద్రగిరి నియోజకవర్గ ఉపాధ్యక్షులు ఎం ప్రకాష్ జిల్లా కార్యదర్శి ఎన్ శ్రీరాములు ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికుల జిల్లా ప్రథమ మహాసభ కరపత్రాలను ఆవిష్కరించడం జరిగినది. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ అనేక పోరాటాలతో సాధించుకున్న భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు ద్వారా 2007 నుండి లబ్ధి కలిగేదని ప్రస్తుతం ప్రభుత్వం సంక్షేమ నిధి డబ్బులను దారి మళ్లించినదని జీవో నంబర్ 17 ద్వారా దారి మళ్లించిన సంక్షేమ బోర్డు నిధులను తక్షణమే బోర్డు లో జమ చేయాలని మరియు రాష్ట్రంలో 32 వేల పెండింగ్ క్లెయిమ్స్ వెంటనే విడుదల చేయాలని@ 55 సంవత్సరాల పైబడిన భవన నిర్మాణ కార్మికులకు 5000 పెన్షన్ ఇవ్వాలని@ ఉచిత ఇసుక పాత పద్ధతిలోనే సరఫరా చేసి భవన కార్మికులకు ఉపాధి కల్పించాలని. పై సమస్యల సాధనకు కామ్రేడ్ గంధమనేని శివయ్య కృష్ణారెడ్డి భవనం బైరాగి పట్టెడ తిరుపతి నందు ఏపీ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ తిరుపతి జిల్లా ప్రధమ మహాసభను జయప్రదం చేయాలని కార్మికులను కోరారుఈ కార్యక్రమంలో భవన కార్మికులు రాజా అన్నయ్య సోము షేక్ లాల్ భాష రామకృష్ణ చారి తదితరులు పాల్గొన్నారు