Red Cross help the family of the cyclone victim

భారత్ న్యూస్ కోడూరు

తుఫాను బాధిత కుటుంబానికి రెడ్ క్రాస్ చేయూత.!

కోడూరు మండల పరిధిలోని జరుగువానిపాలెం గ్రామంలో తుఫాను ప్రభావంతో పూరిల్లు కుప్పకూలి నష్టపోయిన అప్పికట్ల లంకేశ్వరరావు కుటుంబ సభ్యులకు కోడూరు మండల ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారు ఆర్థిక చేయూతను అందించారు.

కృష్ణాజిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ వారు అందించిన వంట సామాగ్రి, స్థానిక శాఖ సభ్యుల సహకారంతో నిత్యవసర సరుకులు, కోడూరు మండల మాజీ డిసి వైస్ చైర్మన్ కాగిత రామారావు అందించిన 25 కేజీల BPT బియ్యాన్ని బాధిత కుటుంబ సభ్యులకు శనివారం అందజేశారు.

ఈ కార్యక్రమంలో మండల శాఖ చైర్మన్ వేజెండ్ల శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ తోట శ్రీనివాసరావు, శాఖ సభ్యులు జొన్నా రవిశంకర్, కొండవీటి సురేష్, గోనా వేణు తదితరులు పాల్గొన్నారు.