Patan Mastan Bhasha as Vice President of Chittoor Joint District of Congress Party

కాంగ్రెస్ పార్టీ చిత్తూరు ఉమ్మడి జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా పటాన్ మస్తాన్ భాష

తిరుపతి జిల్లా ( భారత్ న్యూస్ ) చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చిత్తూరు ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ పఠాన్ మస్తాన్ భాష మీడియా సమావేశం బుధవారం నిర్వహించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ చిత్తూరు ఉమ్మడి జిల్లా వైస్ ప్రెసిడెంట్ పటాన్ మస్తాన్ భాష మీడియా సమావేశంలో మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి ఈ పదవి బాధ్యతలు నాకు అప్పగించిన నేషనల్ లీడర్స్ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే,సోనియాగాంధీ,రాహుల్ గాంధీ,సి.డబ్ల్యూ.సి మెంబెర్ రఘు వీరారెడ్డి,రుద్రరాజు,స్టేట్ లీడర్ పిసిసి ప్రెసిడెంట్ వై.ఎస్ షర్మిల,పిసిసి వైస్ ప్రెసిడెంట్ వేణుగోపాల్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.అలాగే ఈ పదవి రావడానికి కృషి చేసిన
డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ పోటురు భాస్కర్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తెలిపారు.కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని,అభివృద్ధికి నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు.ముస్లిం మైనార్టీలకు,ఎస్సీ,ఎస్టీ వర్గాల అభివృద్ధికి తోడ్పడిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని,ఇంకా అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లాలంటే కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పాకాల మండల ప్రెసిడెంట్ మహబూబ్ బాషా,ఇంతియాజ్,షేక్ హుస్సేన్,షేరు,కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.