పాకాల మండలంలో పటిష్టమైన శాంతిభద్రతలు నెలకొల్పడానికి కృషి చేస్తా….పాకాల సి.ఐ రాజగోపాల్
పాకాల (భారత్ న్యూస్ )తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల పోలీస్ స్టేషన్ లో శనివారం మీడియా సమావేశం పాకాల సి.ఐ రాజగోపాల్ నిర్వహించారు.
ఈ సందర్భంగా పాకాల సి.ఐ రాజగోపాల్ మాట్లాడుతూ గతంలో కడప జిల్లాలో విధులు నిర్వహిస్తూ ఎన్నికల బదిలీపై పాకాల పోలీస్ స్టేషన్ కు సి.ఐ గా రావడం జరిగిందని తెలిపారు.మండలంలో ఎక్కడైనా గాని అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా,అసాంఘిక కార్యక్రమాలు,ట్రాఫిక్ నిబంధనలకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి నివారణ చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఎన్నికల దృష్ట్యా రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు.ఎన్నికల బందోబస్తులో భాగంగా స్పెషల్ ఫోర్స్,కేంద్ర బలగాలతో ఎక్కడ ఎలాంటి సంఘటనలు జరగకుండా శాంతి భద్రతాపరంగా కటినమైన చర్యలు తీసుకుంటున్నామని హెచ్చరించారు.