ప్రత్యేక చెక్ పోస్ట్ జాతీయ రహదారిపై శుక్రవారం విస్తృతంగా మండుటెండలో భారీగా వాహనాలను తనిఖీ చేపట్టారు

భారత్ న్యూస్:
విస్తృతంగా వాహనాల తనిఖీ చేస్తున్న ఎస్ ఎస్ టీం..

కూడేరు మార్చి29 ( భారత్ న్యూస్) స్థానిక మండల కేంద్రంలోని అనంత వెంకట్రామిరెడ్డి కాలనీ యందు ఎన్నికలలో భాగంగా ప్రత్యేక చెక్ పోస్ట్ జాతీయ రహదారిపై శుక్రవారం విస్తృతంగా మండుటెండలో భారీగా వాహనాలను తనిఖీ చేపట్టారు, ఈ సందర్భంగా ఎస్ ఎస్ టీం సూపర్వైజర్ రాజశేఖర్ ప్రయాణికులతో మాట్లాడుతూ వాహనాలలో ప్రయాణం చేసేటప్పుడు 50వేల రూపాయలకు మించి నగదును తీసుకువెళ్లకూడదని, తప్పనిసరిగా తీసుకువెళ్లే లాగా ఉంటే నగదుకు సంబంధించిన తగిన ఆధారాలు దగ్గర ఉంచుకోవాలని, లేనిపక్షంలో నగదు తో పాటు వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందని ఎస్ ఎస్ టీం సూపర్వైజర్ రాజశేఖర్ ప్రయాణికులకు వాహనదారులకు తగు సూచనలు తెలియజేశారు..