రైతు బిడ్డగా మారిన తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి
పాకాల ( భరత్ న్యూస్ )
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం చిన్నగోర్పాడు పంచాయతీలోని గ్రామాలలో గడపగడపకు మహాపాదయాత్ర కార్యక్రమం గురువారం తుడా చైర్మన్ మోహిత్ రెడ్డి గ్రామాల్లోని నాయకులు, మహిళలు మోహిత్ రెడ్డికి పూలమాలలు వేసి ఘన స్వాగతం పలికారు.ఎద్దుల బండిని అలంకరించి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి చేత రైతుబిడ్డగా గ్రామాలలో ప్రత్యేక ఆకర్షణగా ప్రచారం చేశారు.ఈ సందర్భంగా తుడా చైర్మన్,వైఎస్ఆర్ సీపీ 2024 ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గత నాలుగున్నర సంవత్సరాల పరిపాలన కాలంలో ప్రజలకు అమలు చేసిన సంక్షేమ పథకాలతో లబ్ధి పొందిన ప్రజలు అక్కున చేర్చుకుని ఆశీర్వవచనాలతో దీవిస్తున్నారని తెలిపారు.చంద్రగిరి ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలతో ప్రజలు రాబోయే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని మళ్లీ అధికారంలోకి తీసుకురావడానికి సంసిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.గత ఎనిమిది నెలలుగా గడపగడప పాదయాత్ర నిర్వహిస్తున్నామని,ఎక్కడికి వెళ్లినా ప్రజల అభిమానం తగ్గలేదని,అపూర్వ ఘన స్వాగతం పలుకుతున్నారని తెలిపారు