TDP is sure to come to power…The problems of every panchayat and village will be solved

భారత్ న్యూస్,చంద్రగిరి,

టీడీపీ అధికారంలోకి రావడం ఖాయం…

ప్రతి పంచాయతీ, గ్రామ సమస్యలు తీరుతాయి…

నియోజకవర్గ అభివృద్ధి “పులివర్తి నాని” భాద్యత.‌..

మినీ మేనిఫెస్టోకు అద్భుత ఆదరణ…

“మీ ఇంటి వద్దకు మీ పులివర్తి నాని” కార్యక్రమంలో పులివర్తి సుధా రెడ్డి…

చంద్రగిరి

2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని తెలుగుదేశం పార్టీ చిత్తూరు పార్లమెంటరీ అధ్యక్షుడు, చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి స్పష్టం చేశారు. “మీ ఇంటి వద్దకు మీ పులివర్తి నాని” “బాబు ఘారిటి భవిష్యత్తుకు గ్యారెంటీ” కార్యక్రమంలో భాగంగా చంద్రగిరి పట్టణంలో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా మండల నాయకులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. పులివర్తి సుధారెడ్డి ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

ప్రతి పంచాయతీ, గ్రామ సమస్యలు తీరుతాయి…

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే చంద్రగిరి నియోజకవర్గంలో ప్రతి పంచాయితీ, గ్రామాలలో సమస్యలు తీరుతాయని పులివర్తి సుధారెడ్డి అన్నారు. మీ ఇంటి వద్దకు మీ పులివర్తి నాని కార్యక్రమంలో వస్తున్న సమస్యలను ఎప్పటికప్పుడు నోట్ చేసుకోవడం జరుగుతుందని చెప్పారు. ప్రతి వీధి, ప్రతి గ్రామంలో సమస్యలు వెల్లువెత్తుతున్నాయని చెప్పారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యల పరిష్కారానికి పులివర్తి నాని కృషి చేస్తారని ఆమె అన్నారు.

నియోజకవర్గ అభివృద్ధి “పులివర్తి నాని” బాధ్యత…

చంద్రగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలిచి దాదాపు 30ఏళ్లు అవుతుందని ఒక్క అవకాశం ఇస్తే పులివర్తి నాని అభివృద్ధికి అర్థం చెపుతానని ఆమె పేర్కొన్నారు. డ్రైనేజీ, కాలువలు సమస్యలు, రోడ్లు సమస్యలు, తుఫాన్లకు కొట్టుకుపోయిన బ్రిడ్జిల నిర్మాణం, రైతాంగం సమస్యలు నియోజకవర్గన్ని పట్టి పీడిస్తీన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగున్న ఏళ్లుగా పరిస్థితులు మరింత దారుణంగా తయారయ్యాయని దుయ్యబట్టారు. ఒక్క అవకాశం ఇస్తే ప్రతి ఇంటికి పెద్ద కొడుకులా నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి పరుస్తారని వివరించారు.

మినీ మేనిఫెస్టోకు అద్భుత ఆదరణ…

మహానాడు వేదికగా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన మినీ మేనిఫెస్టోకు అద్భుతమైన ఆదరణ లభిస్తోందన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రకటించిన మినీ మేనిఫెస్టో ద్వారా ఒక్కో కుటుంబానికి ఏటా రూ.1.22 లక్షలు ఆర్థికసాయం అందుతుందని ఆమె స్పష్టం చేశారు. అంతేకాదు అదనంగా 3 గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కలుగుతుందని చెప్పారు. రాష్ట్ర సంపద పెంచాలన్న, పేదలకు పంచాలన్నా తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని మరోసారి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి జనసేన నాయకులు కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు