Birth anniversary of Nandamuri Taraka Rama Rao (NTR)

బెజ్జపురంలో ఎన్టీఆర్ వర్ధంతి భారత్ న్యూస్,
లావేరు, జనవరి 18: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) వర్ధంతి సందర్భంగాశ్రీకాకుళం జిల్లా లావేరు మండలం లోని బెజ్జిపురంలో ఎన్టీఆర్ విగ్రహానికి పార్టీ శ్రేణులు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించాయి . ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవాన్ని దశదిశల వ్యాప్తి చేసిన ఘనత ఎన్టీఆర్ కే దక్కింది అన్నారు. ఎన్టీఆర్ కు వారు ఘన నివాళులు అర్పించారు .ఈ కార్యక్రమంలో టిడిపి మండల పార్టీ కార్యదర్శి పిన్నింటి మధుబాబు, గ్రామ టిడిపి ప్రతినిధులు వడ్డిపల్లి శ్రీనివాసరావు, ఇజ్జాడ అప్పారావు,రామారావు,విశ్వనాథం, శ్రీరాములు,దన్నాన శ్రీనివాసరావు (అజార్), అవురు రాంబాబు తదితరులు పాల్గొన్నారు.