జగనన్న గోరుముద్ద అమలుకు కావలసిన వంట పాత్రలు ప్రభుత్వం ఉచితంగా

పాఠశాలలకు వంట పాత్రలు అందజేత
పాకాల ( భారత్ న్యూస్ )
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం
జగనన్న గోరుముద్ద అమలుకు కావలసిన వంట పాత్రలు ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తున్నదని తిరుపతి జిల్లా పాకాల మండలం విద్యా శాఖాధికారి బాబ్జి అన్నారు.శనివారం మండల విద్యా వనరుల కేంద్రంలో ఆయా పాఠశాలలకు వంట పాత్రలు అందచేశారు.ఆయన మాట్లాడుతూ మధ్యాహ్న భోజనానికి చెందిన వంట పాత్రలు ఒక్కొక్క పాఠశాలకు పాఠశాల రోలు బట్టి అందచేశారని అన్నారు.వంట వారు వీటిని ఉపయోగించే భోజనం చేయాలని పేర్కొన్నారు. ఈ పాత్రలు చాలా మేలు రకం కాబట్టి కట్టెల పొయ్యి కాకుండా గ్యాస్ మీద చేయాలని అన్నారు.వంట వారు వంట చేసేటప్పుడు చేతికి గ్లోసులు వేసుకోవాలని అన్నారు.వంట గదిని పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు.గోరుముద్ద కు సంబంధించిన మెనూను నోటీస్ బోర్డ్ నందు డిస్ప్లే చేయాలని అన్నారు.ఉపాద్యాయులు కూడా ప్రతి రోజు మధ్యాహ్న భోజనం చేయాలని అన్నారు. వంటకు వాడే వస్తువులు మేలు రకం అయ్యి ఉండాలని అన్నారు. కార్యక్రమంలో యమ్.ఈ.ఓ.2 లింగయ్య,ఉపాధ్యాయులు, సి.ఆర్.పి.లు ,ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు.