భారత్ న్యూస్ విజయవాడ…ఏపీలో 74% బస్సులు మహిళల ఉచిత ప్రయాణానికి కేటాయింపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా RTC డిపోల కోసం 1,350 కొత్త బస్సులు కేటాయించనున్నట్లు సంస్థ MD ద్వారకా తిరుమలరావు తెలిపారు.
ఇప్పటికే 750 బస్సులు మంజూరు కాగా, మరో 600 బస్సులకి ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు.
వచ్చే నెల నుంచి మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం ప్రారంభించనున్న క్రమంలో మొత్తం 11,000 బస్సుల్లో 74% ఉచిత సేవలకు కేటాయిస్తామని తెలిపారు.

అలాగే ప్రతి బస్టాండ్లో తాగునీరు, కుర్చీలు, ఫ్యాన్ల ఏర్పాటు చేయనున్నారు.