భారత్ న్యూస్ తిరుపతి…..మూడు పెళ్లీళ్ల మహిళ ట్రాప్లో పడి రైల్వే ఉద్యోగి ఆత్మహత్య
తిరుపతి జిల్లా రేణిగుంటలో దారుణ ఘటన
మహిళా సంఘం నాయకురాలు ఉషారాణి వేధింపులు భరించలేక రైల్వే ఉద్యోగి రవి ఆత్మహత్య
రేణిగుంట బుగ్గ వీధిలో ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన రవి
మూడు పెళ్లిళ్లు చేసుకుని, మహిళ సంఘం ముసుగులో రైల్వే ఉద్యోగి రవిని ట్రాప్ చేసిన ఉషారాణి

తూర్పుగోదావరి జిల్లా కడియంకు చెందిన రవితో మూడేళ్ళు సహజీవనం చేసిన ఉషారాణి
మూడు పెళ్లిళ్లు విషయం తెలుసుకుని జాగ్రత్త పడ్డ రవి
రైల్వే సర్వీస్ రికార్డులో తన పేరు నామినిగా పెట్టాలని, రూ.కోటి ఇన్సూరెన్స్ పాలసీ నామినిగా పెట్టాలని వేధించిన ఉషారాణి
ఉషారాణి వేధింపులుపై రేణిగుంట పోలీసులకు ఫిర్యాదు చేసిన రైల్వే ఉద్యోగి రవి
మహిళా సంఘం, సీపీఐ నాయకులతో రాజీ చేసుకోవాలంటూ పోలీసుల సలహా ఇచ్చినట్టుగా తెలిపిన రవి
ఈరోజు మధ్యాహ్నం రేణిగుంట బుగ్గవీధిలో ఆత్మహత్య చేసుకున్న రవి
మ్యాట్రిమోనిలో మరోసారి పెళ్లికి ఆన్లైన్ గాలం వేసిన ఉషారాణి
ఉషారాణి గుట్టు మొత్తం సేకరించి పోలీసులకు ఇచ్చినా పట్టించుకోకపోవడం లేదని మనస్తాపంతో రవి ఆత్మహత్య
ఉషారాణి వేధింపులు వల్లే ఆత్మహత్యకు పాడినట్లు సూసైడ్ నోట్ రాసి చనిపోయిన రైల్వే ఉద్యోగి రవి
సూసైడ్ నోట్ లో తనపై తప్పుడు కేసులతో ఉషారాణి వేధింపులపై వివరంగా రాసిన రవి